Home » Internet
మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.
టీ-ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
ఆడుతు, పాడుతు పనిచేయడం కాదు, ప్రయాణిస్తే ఎంతో బాగుంటుంది. ఉబర్ సరిగ్గా అదే పని చేయ నుంది. ఉబర్ తన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వీలుగా రైడ్ సమయంలో మినీగేమ్స్ను పరిచయం చేసే పనిలో ఉంది. అందుకుగానే యాప్లోనే మినీ గేమ్స్ను అభివృద్ధిపరుస్తోంది.
వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ ఫ్రెండ్లీగా రూపొందిస్తోంది. త్వరలో మరో ఫీచర్ రాబోతుంది. ఇకపై మొబైల్లో నెట్ లేకున్నా వాట్సాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ మెటా వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. పర్సనల్ డేటా భద్రత గాలిలో దీపంలా మారింది. వైఫై సాయంతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న రోజులివి. అలాంటి వైఫైను(Wi-Fi) కాపాడుకోలేకపోతే మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్లే. అలాంటి వైఫైని రక్షించుకోవడమూ ముఖ్యమే.
సూర్యని నుంచి ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ ఆదివారం భూమిని తాకింది. గత ఆరు సంవత్సరాల్లో ఇది అతిపెద్ద సౌర తుఫాన్ అని, దీని వల్ల భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 4 జీ టెక్నాలజీలో నివసించిన భారతీయులు నెమ్మదిగా 5 జీ నెట్వర్క్ వైపు మళ్లుతున్నారు. దీంతో 4 జీ నెట్ వర్క్ కంటే 5 జీ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
హర్యానాలోని నుహ్ జిల్లాలో తాజా అల్లర్లకు అవకాశం ఉందనే సమాచారంతో జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం రాత్రి 11.59 గంటల వరకూ ఇది అమల్లో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చింది.
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని షరతులతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.