Home » Jai Shankar
ఇటీవలే విడుదలైన 'ది కాందహార్ హైజాక్' టెలివిజన్ సిరీస్ గురించి ప్రవాస భారతీయుడు ఒకరు జైశంకర్ను ప్రశ్నించినప్పుడు ఆ సిరీస్ తాను చూడలేదని చెబుతూనే 1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇస్లామాబాద్ ఆహ్వానించిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో నిరంతర చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు.
భారత్ అంటేనే కత్తులు నూరిన మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) ఇవాళ కొత్త పల్లవి అందుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో శనివారం సమావేశమైన విషయం విదితమే.
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్బేస్కు చేరుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు.
విదేశీ గడ్డపై భారత తొలి జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్లో(Mauritius) గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్తో కలిసి జైశంకర్ జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు.
కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 150మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తి చేశారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు
పీఓకేను భారత్లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్కు వార్నింగ్ ఇచ్చారు.