Home » Kiran Kumar Reddy
Kiran Kumar Reddy: ప్రపంచ తెలుగు మహాసభలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
KIRAN KUMAR REDDY: వరి వేస్తే ఊరి అని నిబంధనలు పెట్టిన బీఆర్ఎస్కు రైతుల గురించి మాట్లాడే అర్హతలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జీవితాంతం అధికారంలో ఉంటామని కేటీఆర్ భావించారని చెప్పారు. ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేవలేదని సోషల్ మీడియా ద్వారా చిల్లర కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
MP Chamala Kiran Kumar Reddy: రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల రైతు బంధులో రూ.22 వేల కోట్లు అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు. ఈ ఫార్ములా కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం పట్ల కూడా భక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అంబేద్కర్ పట్ల అమర్యాదగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.
లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను కేవలం తెలంగాణలో ఎన్నికల ఖర్చుల కోసం రూ.7 వేల కోట్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆక్షేపించారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి , రూమ్ ఇచ్చామని కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని.. ఆయన్ను పక్కన పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నారని విమర్శించారు.
మూసీ నదిని ప్రక్షాళన చేస్తేనే భావితరాలకు మనుగడ ఉంటుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనకు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్లో జూబ్లీహిల్స్లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో మాజీ సీఎం కిరణ్ కుమార్ సమావేశమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ప్రస్తుత సీఎంతో మాజీ సీఎం భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఎంతోమంది ముఖ్యమంత్రులు, గొప్ప నాయకులు మూసీని ప్రక్షాళన చేస్తామని ముప్పై ఏళ్లుగా చెబుతూ వస్తున్న మాటలు కార్యరూపం దాల్చలేదని, అలాంటి గొప్ప కార్యాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.