Home » Lakshman
Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల హ్యాంగోవర్ నుంచి బయటపడ్డట్టు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో దేశం, ప్రజాస్వామ్యం పట్ల భారత దేశప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, బీజేపీ వల్ల ప్రధాని కాలేదనే అక్కసుతో దేశం మీద విషం చిమ్ముతున్నారన్నారు.
కేంద్రమంత్రి పదవిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని స్పష్టం చేశారు.పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తానని అన్నారు. తాను ఎప్పుడూ రేసులో ఉండనని.. ఎవరికీ ఏం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అయినా కేసు వ్యవహారం పట్టనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్... ఇన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బాట పట్టారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందువైతే భాగ్యలక్ష్మి టెంపుల్కు రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) సవాల్ విసిరారు. 27 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా..? కాదా...? ప్రమాణం చేయాలి అని సవాల్ విసిరారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా కాదా..? ప్రమాణం చేయాలన్నారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో రేపు(బుధవారం) జరిగే శ్రీరామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిలిపివేసింది. కళ్యాణాన్ని ఈసీ నిలిపివేయడంతో ఈ చర్యలను రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నాడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వివరించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని బీజేపీ (BJP) రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ఆదివారం నాడు టేక్మాల్ మండలం పాల్వంచలో బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఆలే భాస్కర్, బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు.
బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని లక్ష్మణ్ తెలిపా
కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనటానికి సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.