Home » Machilipatnam
మచిలీపట్నంలో పవన్ కుమార్ అనే యువకుడు ఓ బాలిక(15)పై అత్యాచారం చేశాడు. కొన్ని రోజులుగా చిన్నారి వెంట పడుతున్న కామాంధుడు ఆమె కదలికలపై నిఘా పెట్టి దారుణానికి ఒడికట్టాడు.
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.
మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం పనులన త్వరగా ప్రారంభించాలని జనేసన లోక్ సభాపక్ష నేత బాలశౌరి కోరారు.
గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్వం చేసి వారికి ఇష్టమెుచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 35రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కమిషనర్ జి.చంద్రయ్యకు కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష పడింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానాకు హైకోర్టు విధించింది.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు.