Home » Minister Seethakka
Minister Seethakka: బీజేపీ నేత రమేష్ బిధూరిపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Minister Seethakka: కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పని చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.
Minister Seethakka: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు. రేపటి నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని.. వరంగల్లో లాయర్గా పనిచేశానని గుర్తుచేశారు. తాను మూడు సార్లు ప్రజా ప్రతినిదిగా పనిచేశానని అన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యంగులు ఉన్నారు. వారి సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50 కోట్లను కేటాయించిందని అన్నారు.
ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. లగచర్ల ఘటన కలెక్టర్పై దాడి మాజీ మంత్రి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారని విమర్శలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా.. తమ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు మేలు చేస్తోందని అన్నారు.
యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.