Home » Officers and Businessman
ఓ ఇద్దరు అధికారులు వైసీపీ పాలనలో చెలరేగిపోయారు. ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేశారు. ఐదేళ్లలో అడిగేవారు లేకపోవడంతో అధికార దుర్వినియోగం, రూ.కోట్లలో నిధుల స్వాహా పర్వం సాగింది. వైసీపీ నేతల అండదండలు, ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ అధికారుల కంటే వైసీపీ కార్యకర్తల్లా పని చేశారనే ఆరోపణులు వెల్లువెత్తాయి. వైసీపీ నేతల సిఫారసులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అవినీతి, అక్రమాల సొమ్ముల్లోనూ వారికి వాటాలు ...
వైసీపీతో అంటకాగిన పంచాయతీ కార్యదర్శులు, ఈవోఆర్డీలకు కొత్త ప్రభుత్వం గుబులు పట్టుకుంది. అడ్డగోలు పనులు చేసినవారు చర్యల నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. పంచాయతీల పరిధిలోని విలువైన స్థలాలను వైసీపీ నాయకులకు అప్పనంగా కట్టబెట్టారు. ఈ క్రమంలో అధికారులను సైతం బురిడీ కొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మునుముందు ఇబ్బందులు ఎదురౌతాయని ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. ...
హెచ్చెల్సీ నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. నగరంలోని తన స్వగృహంలో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్, ఈఈ రమణారెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ నాగులాపురం వద్ద బలహీనంగా మారిందని, అక్కడ తక్షణం మరమ్మతులు చేయాలని అన్నారు. హెచ్చెల్సీ పొడవునా అనేక వంతెనలు దెబ్బతిన్నాయని, దర్గా హోన్నూరు, గంగలాపురం, గరుడచేడు తదితర ప్రాంతాల్లో వంతెనలు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్చెల్సీలో ...
రెవెన్యూ అధికారులు మండల ప్రజలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. అడ్మిషన్ల సమయం కావడంతో విద్యార్థులు, పంట రుణాల రెన్యువల్ సమయం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల విధులు, సమావేశాల పేరిట విడపనకల్లు తహసీల్దారు కార్యాలయానికి అధికారులు రావడమే మానేశారు. వనబీ అడంగల్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు.. పది రోజుల క్రితం ఆందోళన చేశారు. దీంతో మరుసటి రోజు అధికారులు అందుబాటులోకి వచ్చారు. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది...
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ డబ్బు పంచకుండా మింగేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అనంతపురం అర్బన నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల సందర్భంలోనూ భారీగా నిధులను మింగేశారు. ఆ సమయంలో ఉన్న అధికారులు ఎన్నికలు ముగియగానే వెళ్లిపోవడంతో ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోసారి అలాంటి గడ్డు పరిస్థితే ఎదురు కాబోతోంది. బూత లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ)లు..
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల్లో కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులపై, పనులు పూర్తికాకముందే సర్టిఫికెట్ జారీ చేసిన ఇంజనీరింగ్ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీఎం సీరియ్సగా తీసుకొని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారని, తమపై వేటు కూడా వేసి అవకాశముందని ఇంజనీరింగ్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
రుద్రంపేట సర్కిల్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకూ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో ..
: రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల గుర్తింపునకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలిసింది. విందులో పాల్గొన్నవారంతా అనంతపురం అర్బన, రూరల్ ప్రాంత ఉపాధ్యాయులేనని సమాచారం. వీరిలో అధికశాతం మంది అనంతపురం అర్బన ఓటర్లు. ఎక్కువశాతం వైసీపీ మద్దతుదారులు. గత నెల 31న ఈ రాజకీయ విందు జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉల్లంఘనలపై నిజాయితీగా విచారిస్తున్న అధికారులకు ...
సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఓ ఉన్నతాధికారి బరితెగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఖాతరు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. బుక్కరాయసముద్రంలోని శిక్షణా కేంద్రానికి ఓ కంప్యూటర్ ఆపరేటర్ను అనామతుగా తీసుకున్నారు. ఉద్యగం భర్తీ పేరిట దరఖాస్తు కూడా స్వీకరించారని విశ్వసనీయ సమాచారం. ‘కలెక్టర్కు మనం ఎంత చెబితే అంత..’ ...
సార్వత్రిక ఎన్నికల తొలి అంకం దాదాపుగా ముగిసినట్లే. నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపడుతున్న టీడీపీ కూటమి, అధికార వైసీపీ అభ్యర్థుల నామినేషన్లన్నీ సరిగ్గానే ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ఆమోద ముద్ర వేశారు. దీంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఇక కదనరంగంలోకి దూకేందుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి పక్షం రోజులే...