Home » Ongole
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ వీడేందుకు దాదాపుగా సిద్దమైనట్లు సమాచారం. అందులోభాగంగా ఒంగోలులోని తన వైసీపీ కార్పొరేటర్లు, తన ముఖ్య అనుచరులతో హైదరాబాద్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ వీడకుండా బాలినేని ఉండేందుకు మాజీ మంత్రి విడదల రజినీని మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దింపారు.
Andhrapradesh: ఒంగోలులో శిశువు విక్రయం తీవ్ర కలకలం రేపింది. ఒంగోలు రిమ్స్లో పది వేలకు కన్న కూతురుని విక్రయించిన అంగన్వాడీ కార్యకర్త మంజుల. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన బాలసుందరరావుకి మధ్యవర్తుల ద్వారా చిన్నారిని విక్రయించింది. పాపని అమ్మిన తర్వాత అంగన్వాడీ కార్యకర్త రిమ్స్లో కనిపించకుండా పోయింది.
Andhrapradesh: ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఈరోజు (సోమవారం) నుంచి అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగనుంది. రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో అనగా... 6,26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు.
‘గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచేసి, ఖజానాను ఖాళీ చేసింది. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారు’ అని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు.
వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మానసికంగా బ్యాలెన్స్ తప్పారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు(MLA Janardhana Rao) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కొడుకు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి (Balineni Srinivas Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరుతున్నారంటూ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి నేటి వరకూ పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) నుంచి శ్రావణమాసం ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ‘దివ్య జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేరిట ఆగస్టు 4 నుంచి 12 వరకు పలు పుణ్యక్షేత్రాలను దర్శించేలా టూర్ను ప్లాన్ చేశారు.
దొంగల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా దొరికిన సొత్తును అప్పగించడంలో చేతివాటం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్పై సస్పెన్షన్ వేటు పడింది.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు. ఓ ప్రైవేటు మాల్తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సిసలైన సినిమా వైసీపీ మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు..