Home » PM Modi
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడమే ఉపాధ్యాయుల ప్రధాన ధర్మం. అయితే.. ఒక్కోసారి టీచర్లు తమ విధులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన వారికి లేనిపోని సమస్యలు తీసుకొస్తుంటాయి.
దేశవ్యాప్తంగా ఐదో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
దేశంలో నియంత పాలనను తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోలేక విపక్షాలపై విమర్శలు గుప్పించడం సిగ్గు చేటన్నారు.
శక్తి గ్యారెంటీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో మెట్రో ఆదాయం తగ్గిందని ప్రధానిమోదీ వ్యాఖ్యానించడం బాధాకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ యువరాజు రాహుల్గాంధీ వాడుతున్న మావోయిస్టు భాష కారణంగా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధాని మోదీ విమర్శించారు.
బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా అడుగిడి, దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. భారతీయ జనతా పార్టీలో చేరి, మండీ లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. విపక్ష పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తున్నారు.
ఓ వర్గం ఓట్లు పొందేందుకు పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benerjee) హిందూ సంఘాలపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్లోని(Jharkhand) జంషెడ్పూర్లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అరెస్ట్ను నిరసిస్తూ ఈ రోజు ఆప్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేతలు బీజేపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీసు ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.