Home » Renuka swami
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్యకేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీపపై చార్జ్షీట్ దాఖలయింది. రెండున్నర నెలలపాటు సాగిన కేసు మలుపులకు చార్జ్షీట్తో ఒక కొలిక్కి వచ్చింది.
నేర ప్రవృత్తితో దారుణాలకు పాల్పడినవారిని జైళ్లలోకి వేయడం సహజం. ఎంతటివారైనా అక్కడ కఠినమైన జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. చేసిన తప్పునకు జైళ్లలో పశ్చాత్తాపం కలగాలనేది ముఖ్య ఉద్దేశ్యం. జైళ్ల శాఖలో కొందరి నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం వంటి కారణాలతో దశాబ్దాలుగా జైళ్లు విలాసవంతమైన ప్రాంతాలుగా మారిపోతున్నాయి.
ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. రెండోసారి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్కు వివాదాలు చుట్టుముడుతున్నాయి.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జైలుపాలైన నటుడు దర్శన్(Actor Darshan)కు పరప్పన అగ్రహార జైలు(Parappana Agrahara Jail) భోజనమే కొనసాగుతుంది. ఇంటి భోజనం, పరుపు, దుస్తులు కోరుతూ దర్శన్ దాఖలు చేసుకున్న పిటీషన్ను 24వ ఏసీఎంఎం కోర్టు కొట్టివేసింది. జైలు భోజనంతో అజీర్ణం, అతిసార అవుతోందని, శరీరం బరువు తగ్గుతున్నానని కారణాలు చూపుతూ ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని దర్శన్ తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేసుకున్నారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) ఇంటి నుంచి భోజ నం, పరుపు, పుస్తకాలు పొందేందుకు అనుమతులు కోరుతూ హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దాదాపు నెలరోజులు గా మౌనంగానే ఉన్న ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ సుమలత(Film actress, former MP Sumalatha) మౌనం వీడారు. నటుడు దర్శన్ను సుమలత పెద్దకొడుకుగా భావించేవారు. హత్యకేసులో దర్శన్ ఎ-2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేరకు సుమలత ఏవిధంగా స్పందిస్తారనేది కుతూహలంగా ఉండేది.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్(Actor Darshan)తో పాటు మరో 16 మందికి కస్టడీ గడువు పెంచుతూ కోర్టు ఆదేశించింది.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని(Renukaswamy) హత్య చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వీరశైవ జంగమ సమాజం నాయకులు డిమాండ్ చేశారు. రేణుకాస్వామిని హత్యను నిరశిస్తు వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం లింగసుగూరు పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.