Home » RS Praveen Kumar
గురుకుల పాఠశాలల్లో పాత ఫ్యాకల్టీని ప్రభుత్వం తిరిగి తీసుకునేలా తాము పోరాడుతామని.. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి,
Telangana: రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలను శిథిలం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కుట్రలో సమిధలు అవుతున్నది ఎస్సీలని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో 2000 మంది ఉపాధ్యాయులను రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు.
సీఎం రేవంత్ పాలనా విధానాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. హైడ్రా అందరికీ ఒకే న్యాయం పాటించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలి కానీ.. పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం ఉండకూడదన్నారు.
కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్తో పోల్చితే ప్రస్తుత సీఎం రేవంత్ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని అవాంఛనీయమైన అంశాలు తాజాగా తెరమీదకు రావడం ఆశ్చర్యంగా ఉంది.
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దారితీసిన కారణాల మీద విచారణ జరుగుతుందని.. బాధ్యుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి (Mallu Ravi) తెలిపారు.
తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని కోరారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.