Home » Singareni
సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ విధానంలో నియమితులైన 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఆస్తి కోసం ఓ కుమార్తె తండ్రినే పొట్టనపెట్టుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్క్స్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, ఈ నేపథ్యంలో బ్యాటరీల కోసం వినియోగించే లిథియంతోపాటు ఇతర మూలకాల అన్వేషణ, వెలికితీతపై సింగరేణి దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.
మేజర్ మినరల్స్కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్ మినరల్కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది.
దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను సోమవారం కూల్చివేశారు.
ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు? రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని? మొదటి, రెండో దశల్లో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు దశలవారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తోందని ఆరోపించారు.
సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనేదీ కేంద్రప్రభుత్వానికి లేదని పార్లమెంటు వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. 24 జూలై నాడు పార్లమెంటు వేదికగా ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మౌఖికంగా సమాధానం ఇచ్చారు.