Home » Supreme Court
చేతులతో డ్రైనేజీ పనులు చేస్తూ పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకుంది. స్థానిక సంస్థల్లో ఏ సామాజికవర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండగా.. ఇందులోనే ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంది. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతోందన్న అభిప్రాయాలున్నాయి.
సుప్రీంకోర్టులో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. షర్మిల వేసిన పిటీషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
ఢిల్లీ ఎక్సైజ్ విధానం కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు తాజా సాక్ష్యాధారాలు ఏమున్నాయో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది.
Andhrapradesh: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్కు రూ. 40 వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గురువారం ఎన్నికయ్యారు.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకాడొద్దని ప్రభుత్వానికి
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గత వారం ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను ఏపీ ప్రభుత్వం కొనసాగించింది.