Home » Venkaiah Naidu
Telangana: ఖైరతాబాద్ మహా గణనాధునికి ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముక మహాగణపతికి ఆరో రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు (గురువారం) ఖైరతాబాద్ ఉత్సవాలకుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్య నాయుడితో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు.
తెలుగు రాష్ర్టాల్లో వరద కష్టాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు. తన కుమారుడు, కుమార్తె తరఫున కూడా విరాళం ప్రకటించారాయన.
తెలుగు భాష చాలా ప్రాచీనమైనదని, దీని ప్రాచీనతను మనందరం కాపాడుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తొలి తెలుగు శాసనాలున్న కలమల్లలో గురువారం జరిగిన తెలుగుభాషా దినోత్సవానికి అయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
Telangana: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి నేడు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. అసంబ్లీ ముందున్న ప్రకాశం పంతులు విగ్రహానికి వెంకయ్య, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విషయాన్ని వెంకయ్య ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్న వికసిత్ భారత్ నిర్మాణంలో యువతరం భాగస్వామి కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం బలోపేతం అవుతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని భారత తెలిపారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంచి భోజన ప్రియుడు. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయం చెప్పారు. విజయవాడలో మండవాస్ హోటల్ చాలా ఫేమస్. వెంకయ్య నాయుడు బుధవారం మండవాస్ హోటల్ వచ్చారు. హోటల్ యజమాని మండవ వెంకట రత్నం సాదరంగా స్వాగతం పలికారు. హోటల్లో తెలుగు వంటకాల రుచిని వెంకయ్య నాయుడు చూశారు.
తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కొనియాడారు. ఆచంట వెంకటరత్నం కాంస్య విగ్రహన్ని సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
ఎన్టీఏ కూటమి ప్రభుత్వం నాటక రంగాన్ని ఆదుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) వ్యాఖ్యానించారు. నాటక రంగం బతికి ఉండాలి అంటే ప్రభుత్వం అండ ఉండాలని తెలిపారు. తెలుగు బాషా, కళరంగంపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కి అభిమానం ఉందని చెప్పారు.