Home » Vijayawada Durga Temple
Andhrapradesh: దేవి నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని.. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు.
Andhrapradesh: రోజుకొక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలను భక్తులకు దర్శనమిస్తుంటారు అమ్మవారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవగా.. చివరి రోజు దుర్గాష్టమితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు హైదరాబాద్లోని భాగ్యనగర్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయ కమిటీ కాసేపట్లో బంగారు బోనం సమర్పించనుంది. మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది అమ్మవారికి బంగారు బోనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నట్లు జోగిని విశాక్రాంతి చెప్పారు.