Home » Yadadri Bhuvanagiri
భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్లోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.
Telangana: భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది.
Telangana: విధులకు హాజరుకాని 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈఏ సత్యనారాయణ ఉత్తర్వుల జారీ చేశారు. గత కొన్నేళ్లుకు పాఠశాలకు చెందిన 16 మంది టీచర్లు విధులకు హాజరుకావడం లేదు.
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. బుధవారం యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి(Bhuvanagiri)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో వేడి రాగి జావ మీద పడి ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటనలో ఆ గురుకులం ప్రిన్సిపాల్ వెంకటేశంపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపం ఉందని భావిస్తూ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నలభై శాతం పెరిగిన డైట్ చార్జీలతో రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన నూతన డైట్ను యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలు చేయడం లేదు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్లో తొలి యూనిట్ను(800 మెగావాట్ల సామర్థ్యం) ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నారు.
హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఒక వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని భోజనమే అందుతోంది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.