Union Minister: క్రీడాకారులకు కూడా జగన్ అన్యాయం

ABN , First Publish Date - 2022-12-22T19:22:21+05:30 IST

వైసీపీ (YCP) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ (Union Minister Anurag Singh Thakur) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Union Minister: క్రీడాకారులకు కూడా జగన్ అన్యాయం

న్యూఢిల్లీ: క్రీడాకారులకు కూడా సీఎం జగన్ అన్యాయం చేశారని, సీఎం జగన్, వైసీపీ (YCP) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ (Union Minister Anurag Singh Thakur) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏపీలో ఒక్క క్రీడాకారుడికి శిక్ష‌ణ ఇవ్వ‌లేదని అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఖేలో ఇండియా ప‌థ‌కం కింద ఏపీలో ఒక్క క్రీడాకారుడికి (అథ్లెట్‌) శిక్ష‌ణ ఇవ్వ‌లేద‌ని కేంద్ర యువ‌జ‌న‌, క్రీడ‌ల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. రాజ్య‌స‌భ‌లో ఒక ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి లిఖిత‌పూర్వక స‌మాధానం ఇచ్చారు. ఖేలో ఇండియా ప‌థ‌కం కింద ఏపీలో 2022-23లో ఒక్క అథ్లెట్‌కి కూడా శిక్ష‌ణ ఇవ్వ‌లేద‌ని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తెలంగాణ‌లో మాత్రం 74 మంది క్రీడాకారుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దేశ‌వ్యాప్తంగా 1,709 మంది క్రీడాకారులకు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-22T19:36:22+05:30 IST