MLA Krishnarao: బైరి నరేష్‌పై పీడీయాక్ట్ పెట్టాలి

ABN , First Publish Date - 2022-12-31T08:44:43+05:30 IST

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై పీడీయాక్ట్ పెట్టాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.

MLA Krishnarao: బైరి నరేష్‌పై పీడీయాక్ట్ పెట్టాలి

హైదరాబాద్: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై పీడీయాక్ట్ పెట్టాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని కించపరించేలా మాట్లాడిన నరేష్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. అయ్యప్ప మాలధారణ అత్యంత పవిత్రమైనదని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నానని... అయ్యప్ప స్వామిని, మాల వేసుకునే అయ్యప్ప స్వాములను కించపరచడం దారుణమని మండిపడ్డారు. ఎవరు ఏ మతాన్ని, కులాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. బైరి నరేష్‌పై త్వరలోనే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.

Updated Date - 2022-12-31T08:47:31+05:30 IST