Kidnap: ధర్మవరంలో కిడ్నాప్ కలకలం

ABN , First Publish Date - 2023-09-30T11:06:36+05:30 IST

జిల్లాలోని ధర్మవరంలో కిడ్నాప్ కలకలం రేగింది. వడ్డే పాపన్న@ వెంకటేష్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు.

Kidnap: ధర్మవరంలో కిడ్నాప్ కలకలం

శ్రీసత్యసాయి: జిల్లాలోని ధర్మవరంలో కిడ్నాప్ కలకలం రేగింది. వడ్డే పాపన్న@ వెంకటేష్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు, స్థానికులు.. కదిరి టోల్ ప్లాజా వద్ద దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కిడ్నాపర్లు టోల్ ప్లాజా గేట్‌ను ఢీకొని మరీ పారిపోయారు. ఈ క్రమంలో జాకీర్ హుస్సేన్ అనే కిడ్నాపర్‌ను కారు నుంచి లాగేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలతో పాపన్నను చెన్నైకి చెందిన దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌పై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2023-09-30T11:06:36+05:30 IST