Home » Anantapur
ఒకవైపు రైతులు హెచఎల్సీలో నీరు ఎప్పుడు ప్రవహిస్తాయా అని ఎదురుచూపులు చూస్తున్నారు. అదిఅలా ఉంచితే... ఆ నీరు రాకపోవడంతో వినాయక చవితి సందర్భంగా మూడు రోజులు, ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించిన మండల వాసులు వినాయక విగ్రహాల నిమజ్జనం హెచఎల్సీలో అలాగే వదిలేశారు. మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ప్రజలకు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి నీటి కరువు ఎదురైంది.
మండలంలోని చిన్న జలాలపురం అంగన వాడీ కేంద్రం వద్ద పెరిగిన గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించాలని పిల్లలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన రెండు అంగనవాడీ కేంద్రాలను ఒక భవనంలో నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లలు 30 మంది వస్తారు.
నగరంలోని జమాతే ఇస్లామీ హింద్ ఆర్గనైజేషన ఆధ్వర్యంలో మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆర్గనైజేషన మహిళా అధ్యక్షురా లు అఖిల పర్వీన ఆధ్వర్యంలో రాజీవ్కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు, మిఠా యి లు పంపిణీ చేశారు.
వ్యాపార పరంగా దిన దినాభివృద్ధి చెందుతున్న మండలకేంద్ర మైన నార్పలలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తు న్నాయి. రోజూ రాత్రైతే చాలు ఎవరి ఇంట్లో దొంగలు చొర బడుతారో అనే భయం వారిలో నెలకొంది. కేవలం ఒకటి న్నర నెల వ్యవధిలోనే పెద్ద పెద్ద దొంగతనాలు జర గడం తో మండలకేంద్రం వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
వసతిగృహం లో పరిశుభ్రత పాటించాలని బీసీ సంక్షేమ, చేనేతజౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పుట్టపర్తి ర హదారి పక్కన అద్దెభవనంలో కొనసాగుతున్న బీ సీ బాలికల వసతి గృహా న్ని సోమవారం మంత్రి సవిత తనిఖీ చేశారు.
వ్యవసాయానికి విద్యుత సరఫరాలో ట్రాన్సకో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిట్టూరు, చిక్కేపల్లి గ్రామాల రైతులు సోమవారం నిట్టూరు విద్యుత సబ్స్టేషనను ముట్టడించారు.
ఎట్టకేలకు డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి రిలీవ్ అయ్యారు. ఈనెల 12న డ్వామా పీడీగా ఉన్న వేణుగోపాల్రెడ్డిని మాతృశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈనెల 17 వరకు అవకాశం కల్పించాలని, ఆరోజు రిలీవ్ అవుతానని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ నుంచి వేణుగోపాల్ రెడ్డి అనుమతి తీసుకున్నారు.
ఇంజనీర్ల తయారీ కేంద్రంగా ప్రపంచదేశాలను ఇండియా అధిగమిస్తోందని జేఎనటీయూ ఇనచార్జ్ వీసీ సుదర్శన రావు పేర్కొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ని పురష్కరించుకుని ఆదివారం జేఎనటీయూలో ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. మోక్షగుండం విగ్రహానికి వీసీ సుదర్శన రావు తదితరులు నివాళులర్పించారు.
సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. జిల్లాకేంద్రంలోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్ కాంప్లెక్స్ రీ ఆర్గనైజేషన వ్యవహారంలో ప్ర భుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలన్నారు.
ప్రపంచశాంతి విశ్వశాంతి, సమాజశ్రేయస్సుకోసం ప రితపించిన మహమ్మద్ ప్రవక్త జయంతిని ముస్లింలు ’మిలాద్-ఉన-నబీ’ పండుగగా జరుపుకుంటారు. మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమ వారం జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా మసీదులు, దర్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు.