Share News

Anantapuram Dist.: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల నిర్వాకం

ABN , First Publish Date - 2023-11-21T08:24:54+05:30 IST

అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. బొమ్మనహళ్ మండలం, గోవిందవాడలో ప్రభుత్వ పశు వైద్యశాలను వైసీపీ నేతలు అమ్ముకున్నారు. వారికి కావాల్సిన విధంగా రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు రికార్డులు మార్చారు.

Anantapuram Dist.: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల నిర్వాకం

అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. బొమ్మనహళ్ మండలం, గోవిందవాడలో ప్రభుత్వ పశు వైద్యశాలను వైసీపీ నేతలు అమ్ముకున్నారు. వారికి కావాల్సిన విధంగా రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు రికార్డులు మార్చారు. 2001 సంవత్సరంలో పశు వైద్యశాల నిర్మాణానికి కావలసిన స్థలమును సిద్ధమ్మ అనే మహిళ దానంగా ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం కావడంతో మరమ్మతులు చేయాలని ఉన్నతాధికారులకు సిబ్బంది నివేదించారు.

దీంతో శరణబసప్ప, బళ్లారి నాగమ్మ ఇదే అదునుగా చేసుకుని రెవెన్యూ రికార్డులు మార్పించి స్థలాన్ని మరొకరికి విక్రయించారు. 170-సీ సర్వే నంబర్‌లో 0.03 సెంట్ల స్థలం శరణబసప్పకు హక్కు ఉందంటూ రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన పశువైద్యశాల భవనం 50 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఇంజనీరింగ్ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో కొనుగోలుదారుడు చిదానంద స్వామి వైసీపీ నేతల అండదండలతో పశు వైద్యశాలను కూల్చివేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-11-21T08:25:37+05:30 IST