Adimulapu Suresh: ఆ పనులు ఆగిపోలేదు: ఆదిములపు సురేష్

ABN , First Publish Date - 2023-06-05T17:00:27+05:30 IST

పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగిపోయాయని వార్తలు వస్తున్నాయని,..

Adimulapu Suresh: ఆ పనులు ఆగిపోలేదు: ఆదిములపు సురేష్

అమరావతి: పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగిపోయాయని వార్తలు వస్తున్నాయని, దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఆదిములపు సురేష్ (Adimulapu Suresh) అన్నారు. వారం, పది రోజులుగా సీ‌ఎఫ్‌ఎం‌ఎస్ పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేసి 510.64 కోట్లు క్లియర్ చేశామన్నారు. దీనిలోని 14, 15 ఫైనాన్స్ కు సంబంధించి 169.79 కోట్లు చెల్లింసామన్నారు. వివిధ మున్సిపాలిటీలకు సంబంధించి 269 బిల్స్ క్లియర్ చేసామని తెలిపారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో బిల్స్ అన్ని ఇప్పటికే చెల్లించేసామన్నారు. సీ‌ఎఫ్‌ఏమ్‌ఎస్ కాన్సెప్ట్ గతంలో ప్రారంభించారని గుర్తించుకోవాలని సూచించారు. ఈ విధానం మూలంగానే బిల్లులు చెల్లింపు ఆలస్యం అవుతుందన్నారు.

Updated Date - 2023-06-05T17:00:27+05:30 IST