Chandrababu remand: పెళ్లిరోజునే ఇలా.. చంద్రబాబును చూసి కంటతడిపెట్టిన సతీమణి నారా భువనేశ్వరి

ABN , First Publish Date - 2023-09-10T20:17:05+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు రిమాండ్ విధించడంతో సతీమణి భువనేశ్వరి ఒక్కసారిగా కంటతడిపెట్టుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్‌కు వచ్చారు.

Chandrababu remand: పెళ్లిరోజునే ఇలా.. చంద్రబాబును చూసి కంటతడిపెట్టిన సతీమణి నారా భువనేశ్వరి

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో సతీమణి భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. ఏసీబీ కోర్ట్ హాలుకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూసిన ఆమె ఒక్కసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు.


రిమాండ్ విధిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్‌కు వచ్చారు. వివాహ వార్షికోత్సవం రోజున చంద్రబాబును జైలుకు తరలిస్తుడటంతో టీడీపీ వర్గాలు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించారని తెలిసి కుటుంబ సభ్యులు నిర్వేదంలో ఉన్నారు. రిమాండ్ తిరస్కరిస్తారని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ రిమాండ్ విధించడంతో కుటుంబ సభ్యుల్లో కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఉండవల్లి నివాసం నుంచి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు. కోర్టులో చంద్రబాబును చూసిన వెంటనే భువనేశ్వరితోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి గురయ్యారు.

Updated Date - 2023-09-10T20:34:42+05:30 IST