Union Home Ministry: ఏపీ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖ.. డీజీ సునీల్‌కుమార్‌పై చర్యలకు ఆదేశాలు

ABN , First Publish Date - 2023-02-09T23:14:57+05:30 IST

ఏపీ సీఎస్‌ (AP CS)కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. డీజీ సునీల్‌కుమార్‌ (DG Sunilkumar)పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ లేఖలో పేర్కొంది.

Union Home Ministry: ఏపీ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖ.. డీజీ సునీల్‌కుమార్‌పై చర్యలకు ఆదేశాలు

న్యూఢిల్లీ: ఏపీ సీఎస్‌ (AP CS)కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. డీజీ సునీల్‌కుమార్‌ (DG Sunilkumar)పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ లేఖలో పేర్కొంది. డీజీపై చర్యలు తీసుకుని నివేదిక పంపాలని కేంద్రం స్పష్టం చేసింది. అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికపై పీవీ సునీల్‌కుమార్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సునీల్‌కుమార్ ప్రసంగించారంటూ కేంద్రానికి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.

ఎంపీ రఘురామ ఫిర్యాదుతో పాటు డీవోపీటీ లేఖను ఏపీ సీఎస్‌కు పంపినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఏపీ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని...ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. రాఘురామ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు సీబీఐ, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2023-02-09T23:15:35+05:30 IST