Share News

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

ABN , First Publish Date - 2023-11-28T09:13:26+05:30 IST

తిరుమలలో వీక్‌డేస్‌లో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఇక నేడు (మంగళవారం) అయితే మరింత తక్కువగా ఉంది. నేడు శ్రీవారిని దర్శించుకునేందుకు కేవలం 4 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

తిరుపతి : తిరుమలలో వీక్‌డేస్‌లో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఇక నేడు (మంగళవారం) అయితే మరింత తక్కువగా ఉంది. నేడు శ్రీవారిని దర్శించుకునేందుకు కేవలం 4 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి సైతం కేవలం 4 గంటలే సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 58,176 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.22 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Updated Date - 2023-11-28T09:13:28+05:30 IST