Narasaraopet: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్ల రాజకీయం

ABN , First Publish Date - 2023-03-22T11:06:32+05:30 IST

పల్నాడు జిల్లా (Palnadu Dist.): నరసరావుపేటలో సవాళ్ల రాజకీయం (Challenges Politics) తారస్థాయికి చేరుకుంది.

Narasaraopet: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్ల రాజకీయం

పల్నాడు జిల్లా (Palnadu Dist.): నరసరావుపేటలో సవాళ్ల రాజకీయం (Challenges Politics) తారస్థాయికి చేరుకుంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి (MLA Gopireddy), టీడీపీ నేత అరవిందబాబు (Aravindababu) మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కోటప్పకొండ (Kotappakonda)లో త్రికుటేశ్వరుని సాక్షిగా బహిరంగ చర్చ (Open Discussion)కు సిద్ధమంటూ నేతలిద్దరూ బహిరంగ సవాళ్లు విసురుకున్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలను నిరూపిస్తానంటూ టీడీపీ ఇన్చార్జ్ అరవిందబాబు కోటప్పకొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

నాలుగేళ్లుగా నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ.. టీడీపీ శ్రేణులను హత్యలు చేయిస్తున్నారని టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. ఇటీవల రొంపిచర్ల మండలపార్టీ అధ్యక్షుడు బాలకోటి రెడ్డిని ఎమ్మెల్యేనే హత్య చేయించారని అరవిందబాబు చేసిన వ్యాఖ్యలపై గోపిరెడ్డి స్పందించారు. దమ్ముంటే ఆధారాలు చూపించాలని చేసిన సవాల్‌ను టీడీపీ నేతలు స్వీకరించారు. తాము ఇవాళ కోటప్పకొండ త్రికుటేశ్వరుని సన్నిధికి వెళతామని, ఎమ్మెల్యేకు దమ్ముంటే రావాలని.. అక్కడే అవినీతి, అక్రమాలను ఆధారలతో సహా నిరూపిస్తామని అరవిందబాబు సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఆయన బుధవారం ఉదయం కోటప్పకొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అడ్డుకుని ఇంట్లోనే నిర్బంధించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-03-22T11:06:32+05:30 IST