Rachamallu: ‘అల్లుడి లా వస్తాడు వెళతాడు’... లోకేష్ పాదయాత్రపై రాచమల్లు కామెంట్స్

ABN , First Publish Date - 2023-05-15T13:40:48+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ నూరు రోజుల పాదయాత్రపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rachamallu: ‘అల్లుడి లా వస్తాడు వెళతాడు’... లోకేష్ పాదయాత్రపై రాచమల్లు కామెంట్స్

కడప: టీడీపీ యువనేత నారా లోకేష్ నూరు రోజుల పాదయాత్రపై (Nara lokesh Padayatra) ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Proddutur MLA Rachamallu Sivaprasad Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర నూరురోజు లైనా, వెయ్యి రోజులైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ ప్రయోజనం లేదన్నారు. తండ్రిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికే ఈ యాత్ర అని తెలిపారు. టీడీపీ (TDP) గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చ లేకపోయిందని విమర్శించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఏం చేయలేదని చెబుతారని మండిపడ్డారు. టీడీపీకి లోకేష్ పాదయాత్ర వల్ల నయా పైసా ప్రయోజనం ఉండదన్నారు. ప్రొద్దుటూరుకు లోకేష్ పాదయాత్ర వస్తే అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. లోకేష్ పాదయాత్రతో తనకు వచ్చేనష్టం లేదని.. ‘‘అల్లుడిలా వస్తాడు వెళతాడు’’ అంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-15T13:40:52+05:30 IST