Kurnool Dist.: అంగన్‌వాడి ఆయాపై వైసీపీ నేత అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2023-07-23T10:47:17+05:30 IST

కర్నూలు జిల్లా: ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ శ్రేణుల ఆరాచకాలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా, ఆదోని మండలం, ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్‌వాడి ఆయాపై చంద్ర అనే వైసీపీ నాయకుడు అత్యాచారయత్నం చేశాడు.

Kurnool Dist.: అంగన్‌వాడి ఆయాపై వైసీపీ నేత అత్యాచారయత్నం

కర్నూలు జిల్లా: ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ శ్రేణుల ఆరాచకాలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా, ఆదోని మండలం, ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్‌వాడి ఆయాపై చంద్ర అనే వైసీపీ నాయకుడు అత్యాచారయత్నం చేశాడు. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆయా తప్పించుకొని బంధువుల ఇంట్లోకి పారిపోయింది. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆయా ఉద్యోగం తీయించేస్తానని వైసీపీ నేత బెదిరించాడు. దీంతో ఆయా ఐదు రోజుల పాటు మౌనంగా ఉన్న భార్యను భర్త గట్టిగా నిలదీశాడు. జరిగిందంతా భర్తకు వివరించింది. ఇస్వీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-07-23T10:48:22+05:30 IST