Lokesh: సిట్ ఆఫీస్‌లో చంద్రబాబుతో మాట్లాడిన కుటుంబసభ్యులు.. ఆందోళన చెందవద్దని సూచన

ABN , First Publish Date - 2023-09-09T22:28:47+05:30 IST

తాడేపల్లి సిట్ కార్యాలయంలో (sit office) విచారణలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో (Chandrababu) మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు.

Lokesh: సిట్ ఆఫీస్‌లో చంద్రబాబుతో మాట్లాడిన కుటుంబసభ్యులు.. ఆందోళన చెందవద్దని సూచన

గుంటూరు జిల్లా: తాడేపల్లి సిట్ కార్యాలయంలో (sit office) విచారణలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో (Chandrababu) మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు.


అధికారులు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబును కలిసి నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ కాసేపు మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కుటుంబసభ్యులను చంద్రబాబు కోరారు. ధర్మం తనవైపే ఉందని కుటుంబసభ్యులకు చంద్రబాబు తెలిపారు. కుట్ర రాజకీయాలను సమర్థంగా ఎదుర్కొంటానని కుటుంబ సభ్యులకు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం సిట్ కార్యాలయం నుంచి కుటుంబసభ్యులు వెళ్లిపోయారు.

Updated Date - 2023-09-09T22:47:24+05:30 IST