Crime: పాపం పసిపాపలు.. కన్న తండ్రే తమ పాలిట ఇంతటి దారుణానికి పాల్పడతాడని ఊహించి ఉండరు..

ABN , First Publish Date - 2023-09-05T20:04:20+05:30 IST

కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి తన ముగ్గురు మైనర్ కూతుళ్ల గొంతు కోశాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Crime: పాపం పసిపాపలు.. కన్న తండ్రే తమ పాలిట ఇంతటి దారుణానికి పాల్పడతాడని ఊహించి ఉండరు..

కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి తన ముగ్గురు మైనర్ కూతుళ్ల గొంతు కోశాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామపురంలో నివసించే 40 ఏళ్ల వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి భార్యను వేధించేవాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ 7, 12, 13 ఏళ్ల వయసున్న కూతుళ్లను భర్త దగ్గరే వదలేసి వెళ్లిపోయింది. కూతుళ్లను ఏడాదిపాటు పోషించిన తండ్రి 16 ఏళ్లుగా కాపురం చేసిన భార్య దూరమవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. చీటికి మాటికి ఆగ్రహంతో ఊగిపోయేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను కూతుళ్ల గొంతు కోశాడు. మొదట చిన్న కూతురు గొంతు కోశాడు. అది చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన మిగతా ఇద్దరు కూతుళ్లను కూడా వెంబడించి పట్టుకుని వారి గొంతులు కోశాడు. అనంతరం తాడుతో తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోలేదు. కానీ ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్న కూతురు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ఇద్దరు బాలికల ఆరోగ్యం నిలకడగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-09-05T20:04:20+05:30 IST