Governor Tamilisai: ఇకనుంచి ఆరోగ్య సిబ్బందికి ఒకే రకమైన యూనిఫాం

ABN , First Publish Date - 2023-09-17T09:00:46+05:30 IST

పుదుచ్చేరిలో ఆరోగ్యశాఖ సిబ్బందికి ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయనున్నట్లు గవర్నర్‌ తమిళిసై(Governor Tamilisai) ప్రకటించారు.

Governor Tamilisai: ఇకనుంచి ఆరోగ్య సిబ్బందికి ఒకే రకమైన యూనిఫాం

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరిలో ఆరోగ్యశాఖ సిబ్బందికి ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయనున్నట్లు గవర్నర్‌ తమిళిసై(Governor Tamilisai) ప్రకటించారు. రాజ్‌నివాస్‏లో జరిగిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌వర్మ, కమిషనర్‌ జవహర్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి ముత్తమ్మ, డైరెక్టర్‌ శ్రీరాములు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలను అరికట్టడానికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జ్వరపీడితులకు మెరుగైన చికిత్సలందించే దిశగా ఆసుపత్రులలో సదుపాయాలను కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఆరోగ్యసిబ్బందికి ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయబోతున్నామని తమిళిసై ప్రకటించారు.

Updated Date - 2023-09-17T09:00:46+05:30 IST