Khushboo: సినీ నటి ఖుష్బూ అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-06-13T11:54:15+05:30 IST

పడవేడుకు చెందిన జవాన్‌ ప్రభాకరన్‌ భార్యపై జరిగిన దాడి ఘటనను రాజకీయం చేయొద్దని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సి

Khushboo: సినీ నటి ఖుష్బూ అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారంటే..

అడయార్‌(చెన్నై): తిరువణ్ణామలై జిల్లా పడవేడుకు చెందిన జవాన్‌ ప్రభాకరన్‌ భార్యపై జరిగిన దాడి ఘటనను రాజకీయం చేయొద్దని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) చెప్పారు. ఈ దాడి కేసును జాతీయ మహిళా కమిషన్‌ సుమోటా స్వీకరించిందని చెప్పారు. దాడి ఘటనపై ఆమె సోమవారం సాయంత్రం డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu)ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు డీజీపీ చెప్పారన్నారు. విచారణ పూర్తయిన తర్వాత ఎన్‌డబ్ల్యూసీ(NWC)కి నివేదిక ఇస్తామని డీజీపీ చెప్పారని ఖుష్బూ తెలిపారు. కళాక్షేత్ర వ్యవహారంలో కూడా జాతీయ మహిళా కమిషన్‌కు చెందిన రేఖా శర్మ నేరుగా వచ్చి బాధిత విద్యార్థినులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఎన్‌డబ్ల్యూసీ కూడా నియమనిబంధనలకు లోబడే పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఒక సంఘటన జరిగిన వెంటనే అక్కడకు వెళ్ళి, సంఘటనకు కారకులైన వారిని పోలీసుల తరహాలో అరెస్టు చేయలేమన్నారు. కళాక్షేత్ర వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఢిల్లీ(Delhi)లో రెజ్లర్స్‌ ఆందోళనపై ఆమె స్పందిస్తూ, వారికి అసోసియేషన్‌ ఉందన్నారు. పైగా వారు నేరుగా ఆందోళనకు దిగారన్నారు. దేశంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా వారికి అండగా నిలుస్తామని ఆమె చెప్పారు.

Updated Date - 2023-06-13T11:54:15+05:30 IST