Earthquake : ఢిల్లీలో స్వల్ప భూకంపం

ABN , First Publish Date - 2023-01-24T15:03:35+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం భూమి కంపించింది. సుమారు 30 సెకండ్లపాటు ఈ పరిస్థితి కనిపించింది.

Earthquake : ఢిల్లీలో స్వల్ప భూకంపం
Delhi

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం భూమి కంపించింది. సుమారు 30 సెకండ్లపాటు ఈ పరిస్థితి కనిపించింది. నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించడంతో దాని ప్రభావం ఢిల్లీలో కనిపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (National Centre for Seismology) ఈ వివరాలను తెలిపింది.

దేశ రాజధాని నగరంలో ఈ నెల 5న కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఆఫ్ఘనిస్థాన్‌ హిందు కుష్ పర్వత ప్రాంతంలో 5.8 తీవ్రతతో భూమి కంపించడంతో, దాని ప్రభావం ఢిల్లీలో కనిపించింది.

Updated Date - 2023-01-24T15:03:39+05:30 IST