Uttar Pradesh : యూపీలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను మినహాయింపు...సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి

ABN , First Publish Date - 2023-05-09T10:31:54+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం వెల్లడించారు....

Uttar Pradesh : యూపీలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను మినహాయింపు...సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి
The Kerala Story tax free

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం వెల్లడించారు.(Uttar Pradesh) కేరళ స్టోరీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టిన ఈ సినిమాపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.‘‘ది కేరళ స్టోరీ సినిమాపై(The Kerala Story) ఉత్తరప్రదేశ్‌లో పన్ను రహితం చేస్తున్నాం’’ (tax free)అని ముఖ్యమంత్రి యోగి హిందీలో ట్వీట్‌ చేశారు.యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath), అతని కేబినెట్ సభ్యులు మొత్తం సినిమా ప్రత్యేక ప్రదర్శనను చూడాలని భావిస్తున్నారు.

మే 6వతేదీన ఈ వివాదాస్పద చిత్రానికి పన్ను రహితంగా ప్రకటించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది.ఉత్తరాఖండ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అదా శర్మ నటించిన చిత్రానికి పన్ను రహితంగా ప్రకటించే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం 5 గంటలకు డెహ్రాడూన్‌లోని పీవీఆర్ హాలులో సినిమాను చూసే అవకాశం ఉంది. ఆయనతో పాటు కేబినెట్ మంత్రి గణేష్ జోషి కూడా పాల్గొననున్నారు.

ఇది కూడా చదవండి : Kerala Story: కేరళ స్టోరీ సినిమా డైరెక్టరుకు బెదిరింపు...ముంబయి పోలీసుల భద్రత

సినిమా విడుదలపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. ట్రైలర్‌లో ఏ ఒక్క వర్గానికి అభ్యంతరకరమైన అంశాలు లేవని పేర్కొంది. సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలోని వివిధ యువజన సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి.తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లు ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పేర్కొంటూ మే 7వతేదీ నుంచి కేరళ స్టోరీ ప్రదర్శనను నిలిపివేశాయి.

Updated Date - 2023-05-09T10:32:49+05:30 IST