Home » Uttar Pradesh
పోలింగ్ బూత్లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు.
‘‘మహిళల్లో ఋతుక్రమ సమస్యలు చాలా సున్నితమైన అంశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి గురించి ఇతరులతో మాట్లాడడం అపరాధంగా భావిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి మారాలనేది నా తపన. అందుకే నాకు చేతనైనది చేస్తున్నాను’’ అని చెబుతారు 35 ఏళ్ళ రాఖీ గంగ్వార్.
వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.
రాయబరేలితో తన కుటుంబ సభ్యులకు, తనకు ఉన్న అనుబంధాన్ని, తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తన సోదరి ప్రియాంక గాంధీకి, తనకు మధ్య జరిగిన సంభాషణల వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు.
రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో శుక్రవారం వరుస ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. తన ప్రసంగాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కూటమిపై పంచ్లు గుప్పిస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ ఇద్దరూ విదేశాలకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుట్టు తనకు తెలిసిందని ఫతేపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేథీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అమేథీ నుంచే తాను రాజకీయాలు నేర్చుకున్నానని, తాను వారితోనే ఉన్నానని, ఉంటానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థి కేఎల్ శర్మ తరఫున శుక్రవారంనాడు ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాయబరేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారంటూ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం 'హ్యాట్రిక్' సాధించి తీరుతుందని అన్నారు. 'ఇండియా' కూటమి నేతలు ఒక్కొక్కరే జారుకుంటున్నారని అన్నారు.
Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.