Share News

Delhi : ‘కావడి యాత్ర పేర్ల’పై సుప్రీం స్టే కొనసాగింపు

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:25 AM

కావడియాత్ర మార్గంలో హోటళ్ల యజమానులు తమ పేర్లను, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై ఇచ్చిన స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Delhi : ‘కావడి యాత్ర పేర్ల’పై సుప్రీం స్టే కొనసాగింపు

న్యూఢిల్లీ, జూలై 26: కావడియాత్ర మార్గంలో హోటళ్ల యజమానులు తమ పేర్లను, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై ఇచ్చిన స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 22వ తేదీన ఈ అంశంలో సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై శుక్రవారం విచారణ కొనసాగింది. హోటళ్ల యజమానులు ఎవరైనా స్వచ్ఛందంగా తమ పేర్లను ప్రదర్శించాలనుకుంటే ఆ పని చేయవచ్చని, కానీ, దీని కోసం ఎవరినీ బలవంతపెట్టవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వాలు, పిటిషన్‌దార్లు తమ వాదనలను సమర్పించాలని పేర్కొంటూ విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. కావడియాత్ర ఆగస్టు 6వ తేదీ వరకు కొనసాగనుంది.

Updated Date - Jul 27 , 2024 | 04:25 AM