IND vs WI 4th T20: టాస్ గెలిచిన వెస్టీండీస్.. తుది జట్టులో 3 మార్పులు

ABN , First Publish Date - 2023-08-12T19:49:47+05:30 IST

భారత్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. కాగా వెస్టిండీస్ మాత్రం 3 మార్పులతో బరిలోకి దిగుతుంది.

IND vs WI 4th T20: టాస్ గెలిచిన వెస్టీండీస్.. తుది జట్టులో 3 మార్పులు

ఫ్లోరిడా: భారత్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. కాగా వెస్టిండీస్ మాత్రం 3 మార్పులతో బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న జేసన్ హోల్డర్, షాయ్ హోప్, ఓడియన్ స్మిత్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నారు. కాగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-2తో వెనుకంజలో ఉన్న టీమిండియా నేటి మ్యాచ్‌లోనూ గెలిచి 2-2తో సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఎగురేసుకుపోవాలని వ్యూహాలను రచిస్తోంది.


తుది జట్లు

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మేయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెకాయ్

భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్

Updated Date - 2023-08-12T19:54:25+05:30 IST