IND vs WI 5th T20: టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ కోసం రెండు జట్లు అమీ తుమీ!

ABN , First Publish Date - 2023-08-13T19:49:23+05:30 IST

వెస్టిండీస్‌తో కీలకమైన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అటు వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ ముందుగా తమకు బౌలింగ్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.

IND vs WI 5th T20: టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ కోసం రెండు జట్లు అమీ తుమీ!

ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో కీలకమైన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అటు వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ ముందుగా తమకు బౌలింగ్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. వెస్టిండీస్ మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. పేసర్ మెకాయ్ స్థానంలో మరో పేసర్ అల్జారీ జోసెఫ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. మొదటి రెండు టీ20ల్లో విండీస్ గెలవగా.. తర్వాతి 2 టీ20ల్లో భారత్ గెలిచింది. చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది. దీంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఒకరకంగా ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై లాంటిదని చెప్పవచ్చు.


తుది జట్లు

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్

భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్

Updated Date - 2023-08-13T19:51:44+05:30 IST