Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై సప్నాగిల్ కేసు

ABN , First Publish Date - 2023-02-21T11:20:34+05:30 IST

బెయిలుపై బయటకు వచ్చాక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్‌ భారత క్రికెటర్ పృథ్వీ షాపై కేసు పెట్టారు...

Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై సప్నాగిల్ కేసు
Sapna Gill Cricketer Prithvi Shaw

ముంబయి: బెయిలుపై బయటకు వచ్చాక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్(Social media influencer) సప్నా గిల్‌ భారత క్రికెటర్ పృథ్వీ షాపై కేసు పెట్టారు.(Sapna Gill) క్రికెటర్ పృథ్వీ షా(Cricketer Prithvi Shaw) స్నేహితుడి కారును ధ్వంసం చేసినందుకు ఒషివారా పోలీసులు కేసు పెట్టిన 8మందిలో సప్నా గిల్ ఒకరు. తమను మొదట రెచ్చగొట్టింది భారత క్రికెటర్, అతని స్నేహితులేనని సప్నాగిల్ ఆరోపించారు. సెల్ఫీ వివాదంలో క్రికెటర్ కు సప్నాగిల్ కు మధ్య జరిగిన గొడవలో కారు విండ్‌షీల్డ్ దెబ్బతింది.

సోషల్ మీడియా ఫేమ్ అయిన సప్నాగిల్ క్రికెటర్ పృథ్వీ(Case against Cricketer) అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్‌పై ముంబై ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుతో వివాదం ముగిసేలా కనిపించడం లేదు.మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయడంతో సప్నా గిల్ ముంబై పోలీసు కస్టడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజాగా కేసు పెట్టారు.ముంబయిలోని ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా పృథ్వీ షా సెల్ఫీలకు నిరాకరించడంతో ఈ గొడవ జరిగింది.

ఇది కూడా చదవండి : NIA raids: గ్యాంగ్‌స్టర్లు-ఉగ్రవాదుల మధ్య సంబంధాలు...72 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

ఫిబ్రవరి 15వతేదీన తాను ఒక క్లబ్‌కి వెళ్లానని, ఆ క్రికెటర్‌, అతని స్నేహితులు మద్యం మత్తులో ఉన్నారని సప్నాగిల్ పేర్కొంది. శోభిత్ ఠాకూర్ అనే తన స్నేహితుడు సెల్ఫీ కోసం షాను సంప్రదించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సెల్ఫీ వివాదానికి తాజా ట్విస్ట్‌లో పృథ్వీ షా తనపై దాడికి పాల్పడ్డాడని సప్నాగిల్ ఆరోపించింది.కాగా సప్నాగిల్ ముంబై ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయ లేదు.

Updated Date - 2023-02-21T11:45:45+05:30 IST