Womens T20 World Cup : టీంఇండియా మహిళా జట్టుకు కోహ్లీ, టెండూల్కర్ ప్రశంసలు

ABN , First Publish Date - 2023-02-13T11:43:18+05:30 IST

మహిళల టీ20 ప్రపంచ కప్ 2023(Womens T20 World Cup) ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా మహిళల జట్టును భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ...

Womens T20 World Cup : టీంఇండియా మహిళా జట్టుకు కోహ్లీ, టెండూల్కర్ ప్రశంసలు
Tendulkar, Kohli laud Harmanpreet and Co

ముంబయి: మహిళల టీ20 ప్రపంచ కప్ 2023(Womens T20 World Cup) ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా మహిళల జట్టును భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ప్రశంసించారు.(Sachin Tendulkar,Virat Kohli)పాకిస్థాన్‌ జట్టుపై ఉత్కంఠభరితమైన విజయం సాధించిన తర్వాత హర్మన్‌ప్రీత్ అండ్ కోను క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసించారు.జెమిమా రోడ్రిగ్స్ అజేయ అర్ధ సెంచరీతో హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ కో 19 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి, 150 పరుగుల రికార్డు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.

ఇది కూడా చదవండి : Turkey Another Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం...34వేలకు చేరిన మృతుల సంఖ్య

అధిక ఒత్తిడి గేమ్‌లో మంచి ప్రదర్శన చేసినందుకు విరాట్ కోహ్లి ప్రశంసించారు. ‘‘కఠినమైన పరుగుల వేటలో పాకిస్థాన్‌పై మా మహిళల జట్టు విజయం సాధించింది.భారత్ మళ్లీ గెలుపొందడం అద్భుతం... ఈ విజయం మహిళల క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి స్ఫూర్తినిస్తోంది. మీ అందరికీ మరింత శక్తి ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను’’ అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి : Kantara actor Rishab Shetty: కాంతారా కేసులో ట్విస్ట్...రిషబ్ శెట్టిని విచారించిన పోలీసులు

షఫాలీ శుభారంభం చేయగా రిచా,జెమీమాల సంచలన ఇన్నింగ్స్‌తో విజయం సాధించారని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు.‘‘నేను అంజలి, అర్జున్‌తో కలిసి గేమ్‌ని వీక్షించాను, మా భారత మహిళల జట్టు ఆటను చూసి మేం ఎంతో ఆనందించాం,భారత్ మళ్లీ గెలుపొందడం అద్భుతం’’ అని సచిన్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-02-13T11:43:20+05:30 IST