IND VS WI : రెండో టీ20 విండీస్‌దే.. భారత్‌కు మరో ఓటమి

ABN , First Publish Date - 2023-08-07T00:06:05+05:30 IST

టీంఇండియా(Team India) వెస్టిండీస్‌(West Indies) మధ్య రెండో టీ20(Second T20) ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ మరోసారి ఓటమి పాలయింది. విండీస్‌నే మరోసారి విజయం వరించింది.

 IND VS WI : రెండో టీ20 విండీస్‌దే.. భారత్‌కు మరో ఓటమి

గయానా: టీం ఇండియా(Team India) వెస్టిండీస్‌(West Indies) మధ్య రెండో టీ20(Second T20) ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ మరోసారి ఓటమి పాలయింది. విండీస్‌నే మరోసారి విజయం వరించింది. వెస్టిండీస్‌ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్ విండీస్‌‌కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 18.5 ఓవర్లలోనే 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని సునాయాసంగా చేజిక్కించుకోని టీం ఇండియాను మరోసారి చతికిలపడేసింది. తొలి టీ20లోనూ భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.


వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో కుల్దీప్ యాదవ్ చేతికి గాయం అయిందని, అందుకే అతను ఈ మ్యాచ్ ఆడడం లేదని టాస్ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే గాయం పెద్దది ఏం కాదని, కాకపోతే ముందు జాగ్రత్తగా ఈ మ్యాచ్‌లో ఆడించడం లేదని చెప్పాడు. అటు అతిథ్య వెస్టిండీస్ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇక మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడి సిరీస్‌లో వెనుకబడ్డ భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి లీడ్‌ను సమం చేయాలని భావిస్తోంది. కాగా మొదటి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన వెస్టిండీస్ సిరీస్‌లో 1-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-08-07T00:14:33+05:30 IST