Share News

KTR : ప్రభుత్వం మంచి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతోంది

ABN , First Publish Date - 2023-11-18T13:59:06+05:30 IST

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న కరెంటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి.. షబ్బీర్ అలీకి కనిపించడం లేదని.. కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైనా మూడు గంటల కరెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.

KTR : ప్రభుత్వం మంచి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతోంది

కామారెడ్డి : బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న కరెంటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి.. షబ్బీర్ అలీకి కనిపించడం లేదని.. కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైనా మూడు గంటల కరెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నీ మంచి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతుందని కేటీఆర్ అన్నారు.

‘‘కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాగానే 400 కే మహిళలకు గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేస్తాం. 18 సంవత్సరాల నిండిన మహిళలకు 3000 రూపాయలు చొప్పున సౌభాగ్యాలకు పథకం కింద అందజేస్తాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5 లక్షలు బీమా అందజేస్తాం. రైతు బంధువులు 16000 వేలకు పెంచుతాం. 24 గంటల కరెంటు కావాలంటే కేసీఆర్ కు ఓటేయండి. మూడు గంటల కరెంట్ కావాలంటే మీ ఇష్టం ఉన్నవారికి ఓటేయండి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-18T13:59:07+05:30 IST