Share News

TS Elections: ప్రచారాలతో హోరెత్తించిన నేతలు.. ఇక ప్రలోభాలపై పార్టీల దృష్టి

ABN , First Publish Date - 2023-11-28T17:42:46+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాలతో నేతలు హోరెత్తించారు.

TS Elections: ప్రచారాలతో హోరెత్తించిన నేతలు.. ఇక ప్రలోభాలపై పార్టీల దృష్టి

వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాలతో నేతలు హోరెత్తించారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్, ఈటల రాజేందర్ ప్రచారం సాగించారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ సీనియర్లు, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.

విమర్శలు, ప్రతి విమర్శలతో నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై బీఆర్ఎస్ ప్రచారం చేసింది. 6 గ్యారంటీలు, బీఆర్ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. సకల జనుల మేనిఫెస్టోపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక ప్రలోభాలపై పార్టీలు దృష్టి పెట్టాయి. పోల్ మేనేజ్ మెంట్ నేతలు నమ్ముకున్నారు. 12 నియోజకవర్గాల్లో 271 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పరకాలలో అత్యధికంగా 36 మంది పోటీలో ఉన్నారు. మహబూబాబాద్‌లో అత్యల్పంగా 15 మంది పోటీ చేస్తున్నారు.

Updated Date - 2023-11-28T17:52:11+05:30 IST