Share News

TS Elections : అచ్చంపేటలో అర్ధరాత్రి ఏం జరిగింది.. ఈ గొడవకు కారకులెవరు..?

ABN , First Publish Date - 2023-11-12T08:16:46+05:30 IST

జిల్లాలోని అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం అర్థరాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్‌(BRS, Congress) కార్యకర్తల మధ్య ఘర్షణ

TS Elections : అచ్చంపేటలో అర్ధరాత్రి ఏం జరిగింది.. ఈ గొడవకు కారకులెవరు..?

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం అర్థరాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్‌(BRS, Congress) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(MLA Guvwala Balaraju) తన కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు. అలాగే ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

Achh.jpg

కాగా ఇరుపార్టీల కార్యకర్తల ఘర్షణలో ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను అక్కడినుంచి ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే నుదిటిపై గాయాలైనట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను అనుచరులు హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‏లో బాలరాజు ఫిర్యాదు చేశారు.

Achampet.jpg

Updated Date - 2023-11-12T10:08:04+05:30 IST