Hyderabad: పాపం ఈ మహిళా కానిస్టేబుల్.. ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగి పెళ్లి రద్దయింది.. ఇప్పుడిలా అనుకుంటూ ఉండటంతో..

ABN , First Publish Date - 2023-05-04T16:40:44+05:30 IST

నిశ్చితార్థం రద్దు అవుతుందేమోనన్న మనస్తాపంతో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. శాలిబండ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన..

Hyderabad: పాపం ఈ మహిళా కానిస్టేబుల్.. ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగి పెళ్లి రద్దయింది.. ఇప్పుడిలా అనుకుంటూ ఉండటంతో..

చాంద్రాయణగుట్ట (ఆంధ్రజ్యోతి): నిశ్చితార్థం రద్దు అవుతుందేమోనన్న మనస్తాపంతో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. శాలిబండ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు.. కందుకూరు జైతారం గ్రామానికి చెందిన పర్వతాలు కుమార్తె సురేఖ(28) 2018 బ్యాచ్‌ కానిస్టేబుల్‌. ఏడాది నుంచి ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. చెల్లితో కలిసి కాల్వగడ్డలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. సురేఖకు ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగి అనివార్య కారణాల వల్ల రద్దయింది.

3chrm5.jpeg

ఈ నెల 1న స్వగ్రామంలో మరో యువకుడితో పెళ్లి కుదిరింది. అయితే, ఆ యువకుడితో వరుస కుదరడం లేదని.. సురేఖకు వరుసకు కొడుకు అవుతాడని.. కుటుంబసభ్యులు చర్చించుకోవడం గమనించింది. ఈ నిశ్చితార్థం కూడా రద్దు అవుతుందనే మనస్తాపానికి గురైన సురేఖ బుధవారం చెల్లెలు డ్యూటీకి వెళ్లగానే ఇంట్లో ఉరేసుకుంది. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-05-04T16:41:00+05:30 IST