Share News

TS Congress: టీ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శి సూచనలు

ABN , First Publish Date - 2023-10-24T11:06:59+05:30 IST

టికెట్ల కేటాయింపులో ఏమైనా విభేదాలు పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలి. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. టికెట్ల కేటాయింపుల విషయంలో

TS Congress: టీ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శి సూచనలు

హైదరాబాద్: టికెట్ల కేటాయింపుల వ్యవహారం ఇంకా ముగియలేదని ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై మన్సూర్ అలీఖాన్ మాట్లాడారు. ‘‘టికెట్ల కేటాయింపులో ఏమైనా విభేదాలు పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలి. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. టికెట్ల కేటాయింపుల విషయంలో ఏ నాయకులు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ, నాయకులకు వ్యతిరేకంగా కానీ బహిరంగంగా మాట్లాడవద్దు. పత్రిక సమావేశాలు, ప్రకటనలు ఇస్తూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, పార్టీ నాయకుల మీద బహిరంగంగా మాట్లాడవద్దు. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో కొందరు నాయకులు ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇది పార్టీ విధానాలకు వ్యతిరేకం. ఎంతటి నాయకులైనా బహిరంగంగా మాట్లాడవద్దు. ఎలాంటి సమస్యలున్నా పార్టీ దృష్టికి తీసుకురావాలి.’’ అని కోరారు.

Updated Date - 2023-10-24T11:06:59+05:30 IST