Share News

BJP: చివరి రోజు తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ప్రచారం

ABN , First Publish Date - 2023-11-28T08:54:58+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుండడంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు పలు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. కేంద్రమంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి హన్మకొండలో ప్రచారం చేయనున్నారు.

BJP: చివరి రోజు తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ప్రచారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుండడంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు పలు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. కేంద్రమంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి హన్మకొండలో ప్రచారం చేయనున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నిజామాబాద్ అర్బన్‌లో ప్రచారం నిర్వహిస్తారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేటలో ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆదిలాబాద్, బోథ్, ధర్మపురి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.

బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహిస్తూ.. విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి తరఫున ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. బాలానగర్ చౌరస్తా నుంచి పవన్ రోడ్ షో ప్రారంభంకానుంది. న్యూ బోయినపల్లి క్రాస్ రోడ్, బోయినపల్లి పీఎస్, ఓల్డ్ బోయినపల్లి చెక్ పోస్ట్, హస్మత్ పేట్ బస్టాప్, అంబేద్కర్‌ విగ్రహం వరకు రోడ్ షో జరుగుతుంది. పవన్ రోడ్ షోకు ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-11-28T08:55:01+05:30 IST