Share News

TS News: నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న టీ.కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-12-02T10:27:17+05:30 IST

Telangana: తెలంగాణ చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈరోజు (శనివారం) కలువనున్నారు.

TS News: నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న టీ.కాంగ్రెస్

హైదరాబాద్: తెలంగాణ చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్‌రాజ్‌ను (Telangana Chief Election Officer Vikasraj) తెలంగాణ కాంగ్రెస్ నేతలు (Telangana Congress Leaders) ఈరోజు (శనివారం) కలువనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్‌లో.. అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. నేడు ఈసీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు పలువురు ముఖ్య నాయకులు కలువనున్నారు.

Updated Date - 2023-12-02T10:39:04+05:30 IST