మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి విధ్వంసం సృష్టించిన మహిళ..

ABN , First Publish Date - 2023-05-04T10:18:50+05:30 IST

డైరీ ఫార్మ్ రోడ్‌లో కొత్త బ్లాక్ కలర్ కియా కారు బీభత్సం సృష్టించింది. కియా కారు డ్రైవింగ్ చేస్తూ శివాని అనే మహిళ హల్ చల్ చేసింది.

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి విధ్వంసం సృష్టించిన మహిళ..

Hyderabad : డైరీ ఫార్మ్ రోడ్‌లో కొత్త బ్లాక్ కలర్ కియా కారు బీభత్సం సృష్టించింది. కియా కారు డ్రైవింగ్ చేస్తూ శివాని అనే మహిళ హల్ చల్ చేసింది. ర్యాష్ డ్రైవింగ్ చేసి పలు వాహనాలను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా విద్యుత్ స్తంభాన్ని సైతం ఢీకొట్టింది. అటుగా వెళుతున్న స్విగ్గి బాయ్‌నీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో స్విగ్గి బాయ్‌ని హాస్పిటల్‌కు తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన స్విగ్గి అబ్బాయి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శివాని గచ్చిబౌలిలోని అమెజాన్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివాని మద్యం మత్తులో ఇంతటి విధ్వంసానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

Updated Date - 2023-05-04T10:18:50+05:30 IST