ధర్మపురి స్ట్రాంగ్ రూమ్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-06-22T17:08:52+05:30 IST

ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు తన దగ్గర ఉన్నాయని అనడం విడ్డూరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాల ఒరిజినల్ ఫుటేజ్ లక్ష్మణ్ దగ్గరే ఉందని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ కోర్టుకు సమర్పించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.

ధర్మపురి స్ట్రాంగ్ రూమ్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏమన్నారంటే..!

జగిత్యాల: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు తన దగ్గర ఉన్నాయని అనడం విడ్డూరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాల ఒరిజినల్ ఫుటేజ్ లక్ష్మణ్ దగ్గరే ఉందని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ కోర్టుకు సమర్పించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించారు. స్ట్రాంగ్ రూమ్ తాళం మిస్సవ్వడంతో పగులగొట్టాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇంత జరుగుతున్న మంత్రి ఎందుకు స్పందించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి స్పందించారు.

Updated Date - 2023-06-22T17:08:52+05:30 IST